Header Banner

విజయ్ మాల్యా కేసు.. వేల కోట్ల రుణాలు తీర్చినా రాజకీయ లక్ష్యంగా ఎందుకు? హర్ష్ గోయెంకా ప్రశ్న!

  Fri Jun 06, 2025 14:30        Business, Politics

వివాదాస్పద వ్యాపారవేత్త విజయ్ మాల్యా రూ. 9,000 కోట్లకు పైగా బ్యాంకు రుణాలను తీర్చినట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఆయన ఇంకా రాజకీయ లక్ష్యంగా ఎందుకు మారుతున్నారని ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ప్రశ్నించారు. ఈ విషయంపై గోయెంకా X ప్లాట్‌ఫామ్‌లో చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం విస్తృత చర్చకు దారితీసింది. దీనిపై మాల్యా కూడా స్పందించి.. గోయెంకాకు థ్యాంక్స్ చెప్పారు. ఈ క్రమంలోనే మాల్యా కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.

బ్యాంకు రికవరీ ఎంత?

2024 డిసెంబర్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రకటించిన వివరాల ప్రకారంమాల్యా ఆస్తుల విక్రయం ద్వారా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు రూ. 14,131.6 కోట్లను రికవరీ చేశాయి. ఇది మాల్యా రుణం కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువని ఆయన వాదిస్తున్నారు. అయితే, ఈ రికవరీలు మాల్యా ఆస్తుల బలవంతపు వేలం ద్వారా జరిగాయని, ఆయన స్వచ్ఛందంగా చెల్లించినవి కావని నెటిజన్లు అంటున్నారు.

 

ఇది కూడా చదవండి: హైదరాబాద్ టు అరుణాచలం.. జూన్ నెలలో ప్లాన్‌ చేస్తున్నవారికి బెస్ట్‌ టూర్ ప్యాకేజీ ఇదే!

 

హర్ష్ గోయెంకా ఏమన్నారు?

2025, జూన్ 5X ప్లాట్‌ఫామ్‌లో (ట్విట్టర్) హర్ష్ గోయెంకా.. "విజయ్ మాల్యా విలాసవంతంగా జీవించారు. అవును. రుణాలు చెల్లించలేదు. అవును. కానీ ఇతరుల్లా కాకుండా, ఆయన రూ. 9,000 కోట్లకు పైగా రుణాలను తీర్చినట్లు సమాచారం. అయితే, ఇంకా పెద్ద డిఫాల్టర్లు బ్యాంకుల నుంచి చాలా పెద్ద మొత్తంలో లోన్లు ఎగవేసి స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఒకవేళ రుణాలు ఇంకా ఉన్నాయని బ్యాంకులు చెప్పాలి. లేకపోతే, మాల్యా ఇంకా రాజకీయ లక్ష్యంగా ఎందుకు మారుతున్నారు? న్యాయం నిష్పక్షపాతంగా ఉండాలి. అందరికీ ఒకేలా ఉండాలి." గోయెంకా పోస్ట్‌కు మాల్యా స్వయంగా స్పందిస్తూ, " థ్యాంక్ యూ హర్ష్. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాతపూర్వకంగా ధ్రువీకరించింది. బ్యాంకులు నా నుంచి రూ. 14,100 కోట్లు రికవరీ చేశాయి, అది డెట్ రికవరీ ట్రిబ్యునల్ (DRT) తీర్పు ప్రకారం రూ. 6,203 కోట్ల రుణానికి మించినది.

 

ఇది కూడా చదవండి: నేడు జమ్మూకు ప్రధాని మోదీ.. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి ప్రారంభం!

 

ఈ వివక్ష ఎందుకు?" అని ప్రశ్నించారు. విజయ్ మాల్యా, ఒకప్పుడు 'కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్'గా పేరొందిన వ్యాపారవేత్త, 2005లో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ను ప్రారంభించారు. ఈ విమానయాన సంస్థ లగ్జరీ సేవలకు ప్రసిద్ధి చెందినప్పటికీ, తప్పుడు వ్యాపార వ్యూహాలు, అప్పుల భారం, అవినీతి ఆరోపణలతో 2012 నాటికి మూతపడింది. మాల్యా 17 భారతీయ బ్యాంకుల నుంచి సుమారు రూ. 9,000 కోట్ల రుణాలు తీసుకున్నారని, వాటిని తిరిగి చెల్లించకుండా 2016లో భారతదేశం నుంచి బ్రిటన్‌కు పారిపోయారని ఆరోపణలు ఉన్నాయి. మాల్యాపై మనీలాండరింగ్, మోసం ఆరోపణలతో సహా అనేక నేరపూరిత కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా, IDBI బ్యాంకు నుంచి తీసుకున్న రూ. 900 కోట్ల రుణాన్ని దుర్వినియోగం చేసిన ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనను భారత్‌కు అప్పగించాలని.. భారత ప్రభుత్వం బ్రిటన్‌ను కోరుతోంది. అయితే, మాల్యా తనపై వచ్చిన ఆరోపణలను.. రాజకీయ కారణాలతో కూడినవని, తనకు న్యాయమైన విచారణ జరిగితేనే భారత్‌కు తిరిగి వస్తానని వాదిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..

 

ఓ ఇంటి వాడైన అక్కినేని వారసుడు అఖిల్.. హాజరైన సినీ తారలు!

 

బిగ్ అప్డేట్.. ఈ విషయం తెలియకుండా అస్సలు ఫ్లైట్ ఎక్కొద్దు.. లేదంటే మీ పని అంతే.!

 

అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ నుంచికొత్త ప్రయాణ నిషేధ ఉత్తర్వులు!

 

రైతులకి గుడ్ న్యూస్.. పంటకి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం! దరఖాస్తు ఇలా..

 

నా తప్పు మృగాళ్లందరికీ కనువిప్పు కావాలి.. పాపా నువ్వయినా నన్ను క్షమిస్తావా!

 

జగన్‌పై కేంద్రమంత్రి ఆగ్రహం.. మీ తీరు మారకపోతే ఈసారి మిగిలేది ఒక్కటే!

 

ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. విద్యా, దౌత్య వర్గాల్లో తీవ్ర ఆందోళన! వీసాల రద్దుకు కూడా ఆదేశాలు..

 

హామీల అమలుపై చర్చకు రావాలి.. వైకాపాకు మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే సవాల్!

 

యువగళం పుస్తకం.. లోకేష్‌కు పవన్ అభినందనలు! ఆనాటి అనుభవాలను కళ్ల‌కి కట్టినట్లుగా..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Business #VijayMallya #PoliticalPunchings #HarshGoenkaMallya #RecoveryClaims #BusinessNews #ViralNews